– ఎన్నికల ప్రచార సభలకే ప్రధాని పర్యటన పరిమితం
– అభివృద్ధి అంశాల ప్రస్తావనే లేదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ప్రధాని మోడీ పర్యటనతో రాష్ట్రానికి, ఆ జిల్లాలకు ఒరిగిందేం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపింది. ఇది ఎన్నికల సభ కాదంటూనే ‘400 సీట్లు’ ‘బీజేపీకే అందరి మద్దతు’ అంటూ ప్రసంగించారని గుర్తు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పైగా అయోధ్య రామమందిరానికి బంగారు తలుపులు, ధ్వజస్థంభం తెలంగాణ నుంచే వచ్చాయనీ, రాముడి ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రజలపై ఉంటుందనీ, ప్రధాని తన హోదాను మరిచి ఆలయ ధర్మకర్తలా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో చేశామంటూ మాట్లాడిన మోడీ, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న సీసీఐ పరిశ్రమను పున:ప్రారంభం, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ మంజూరు, జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు, ఆదివాసీలు అత్యధికంగా ఉండే ఈ జిల్లాకు ప్రత్యేకంగా గిరిజన విశ్వవిద్యాలయం కేటాయింపు, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం తదితర అంశాలపై నోరు మెదపలేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారి, మెదక్-సంగారెడ్డి రైల్వేలైను, జిల్లాలో కేంద్రీయ విద్యాలయం, ట్రామాకేర్ ఏర్పాటు వంటి అంశాల గురించి ప్రధాని ప్రసంగంలో ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ కేంద్రం పరిధిలోనివే అయినప్పటికీ, వాటిపై పల్లెత్తు మాట కూడా ప్రధాని మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్ర విభజన హామీల అమలు నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొన్నారు. నదీజలాల వివాదాలు, రైల్వే కోచ్ ఏర్పాటు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రహదారుల నిర్మాణం వంటి అనేక అంశాలు పెండింగ్లోనే ఉన్నాయని వివరించారు. దేశాభివృద్ధి తమతోనే సాధ్యమని చెప్పిన మోడీ ఊకదంపుడు ఉపన్యాసం రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం తప్ప ఇక్కడ ఉపాధి కల్పనకు, అభివృద్ధికి తోడ్పడేది కాదని విమర్శించారు. వరకు రైల్వేలైన్ మంజూరు, జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు, ఆదివాసీలు అత్యధికంగా ఉండే ఈ జిల్లాకు ప్రత్యేకంగా గిరిజన విశ్వవిద్యాలయం కేటాయింపు, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం తదితర అంశాలపై నోరు మెదపలేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారి, మెదక్-సంగారెడ్డి రైల్వేలైను, జిల్లాలో కేంద్రీయ విద్యాలయం, ట్రామాకేర్ ఏర్పాటు వంటి అంశాల గురించి ప్రధాని ప్రసంగంలో ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ కేంద్రం పరిధిలోనివే అయినప్పటికీ, వాటిపై పల్లెత్తు మాట కూడా ప్రధాని మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్ర విభజన హామీల అమలు నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొన్నారు. నదీజలాల వివాదాలు, రైల్వే కోచ్ ఏర్పాటు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రహదారుల నిర్మాణం వంటి అనేక అంశాలు పెండింగ్లోనే ఉన్నాయని వివరించారు. దేశాభివృద్ధి తమతోనే సాధ్యమని చెప్పిన మోడీ ఊకదంపుడు ఉపన్యాసం రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం తప్ప ఇక్కడ ఉపాధి కల్పనకు, అభివృద్ధికి తోడ్పడేది కాదని విమర్శించారు.
హైకోర్టు తీర్పు హర్షణీయం
దేశ ద్రోహ చట్టం కింద ఎంతో కాలంగా జైల్లో మగ్గుతున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతోపాటు, మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. గతంలోనే బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా తేల్చినా, మహారాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ కేసును మరోసారి విచారించాలంటూ బాంబే హైకోర్టుకు సూచించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాయిబాబాతోపాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా పేర్కొందని వివరించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడే బాంబే హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తక్షణమే వారిని విడుదల చేయాలని కోరారు.