రెండు రోజులపాటు మూడో విడత శిక్షణ కార్యక్రమాలు: అదనపు కలెక్టర్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ పార్లమెంటు ఎన్నికల పోలింగ్  కు పివో, ఏపీవోలుగా నియమించబడిన వారికి ఈనెల 8, 9 తేదీలలో  3 వ విడత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వీరికి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని ,ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం  3 గంటలకు  విడతల వారిగా శిక్షణ  ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అందువల్ల పిఓ, ఏపిఓ లు  ఈ శిక్షణ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు.