వేములవాడలో విషాదం.. ఒకే రోజు అత్త, అల్లుడి మృతి..

Tragedy in Vemulawada.. Aunt and son-in-law died on the same day..నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
అత్త మరణవార్త విని అల్లుడు మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కండేయనగర్‌కు చెందిన అలువాల లక్ష్మి (82) శుక్రవారం రోజునఅనారోగ్యంతో మరణించారు. ఈ వార్త విన్న ఆమె పెద్ద అల్లుడు జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన గుంటుక పర్శరాం (58) గుండెపోటుతో కుప్పకూలాడు. ఫోన్‌లో సమాచారమివ్వగా దైవదర్శనానికి విజయవాడకు వెళ్లిన పర్శరాం అక్కడే మరణించినట్లు బంధువులు తెలిపారు. ఒకేరోజు అత్త, అల్లుడు మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.