వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం పక్కాగా వేయాలని, ధాన్యంలో చెత్త లేకుండా ధాన్యాన్ని శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున రామారెడ్డి మండలం పోసాని పేట్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం ను శుభ్ర పరచాలని,మానిటరింగ్ అధికారిని ఆదేశించారు. 40 కిలోల 600 గ్రాముల ధాన్యం బస్తాలో నింపి పక్కాగా తూకం వేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. వర్షాల వలన ధాన్యం తడిసి పోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రాం మోహన్, మానిటరింగ్ అధికారి యు. సాయిలు, తదితరులు పాల్గొన్నారు.