శ్రీధర్ బాబు గెలుపుతోనే నియోజకవర్గం సంక్షేమం

– సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు

– ఆరు గ్యారంటీలపై  జోరుగా ప్రచారం
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని ఎమ్మెల్యేగా జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు గెలిస్తేనే నియోజకవర్గం సంక్షేమంగా ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతిరావు అన్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎంపిటిసి-2 బూత్ 249లో ఆదివారం సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలని వివరిస్తూ విస్తృతంగా రాత్రి, పగలు అనే తేడాలేకుండా బ్యాలెట్ నమూనాతో ప్రజలకు చేతిగుర్తుపై అవగాహన కల్పిస్తూ  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీఆర్‌ఎస్‌ అమలు కానీ హామీలు, మాయమాటలు నమ్మకూడదని, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి శ్రీదర్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి లభిస్తుందన్నారు. మంథని నియోజకవర్గంలో విద్య,వైద్యం పై శ్రీదర్ బాబు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద సాగర్, ఆకుల శ్రీనివాస్, రవిందర్ రావు, రాములు, రమేష్,  గోపి, ఐలయ్య, సురేష్, అశోక్, మాచర్ల రామస్వామి, ఓదెలు, సారయ్య, చెంద్రయ్య, లింగయ్య, ఎల్లయ్య, మల్లేష్, వెంకటేశ్, అగయ్య, వెంకట స్వామి, లచ్చయ్య, రాజయ్య, వెంకయ్య పాల్గొన్నారు.