మధ్య ప్రాచ్యంలో సుస్థిరత నెలకొనాలి

There must be stability in the Middle East– హింస, ఘర్షణలు పెచ్చరిల్లకుండా చూడాలి
– నెతన్యాహుతో రిషి సునాక్‌ భేటీ
– ఈజిప్ట్‌తో కలిసి పనిచేస్తామన్న జిన్‌పింగ్‌
– 27టన్నుల సాయంతో రష్యా విమానం
– అబ్బాస్‌కు మోడీ ఫోన్‌
గాజా, జెరూసలేం, న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌, హమస్‌ మధ్య ఘర్షణలు పెచ్చరిల్లి ప్రాంతీయ ఘర్షణలుగా విస్తరించకుండా చూడడం చాలా ముఖ్యమని బ్రిటీష్‌ ప్రధాని రిషి సునాక్‌ పేర్కొన్నా రు. ఇందుకోసమే పశ్చిమాసియా ప్రాంతవ్యాప్తంగా పలువురు నేతలను కలిసి మాట్లాడాలనుకుంటు న్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో రిషి సునాక్‌ గురువారం భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు ఇజాక్‌ హెర్జోగ్‌తో కూడా సమావేశమయ్యారు. హింస మరిన్ని ప్రాంతాలకు జరిపారు. అనంతరం ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు ఇజాక్‌ హెర్జోగ్‌తో కూడా సమావేశమయ్యారు. హింస మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తంగా మధ్య ప్రాచ్యంలో హింస, ఘర్షణలు పెచ్చరిల్లకుండా చూడాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారని బ్రిటన్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
రష్యా నుంచి 27 టన్నుల సాయం
27టన్నుల సాయాన్ని గాజాకు పంపుతున్నట్లు రష్యా తెలిపింది. మాస్కో నుండి ప్రత్యేక విమానం ఈజిప్ట్‌కు చేరుతుందని, అక్కడ రష్యా మానవతా సాయాన్ని ఈజిప్ట్‌ రెడ్‌క్రీసెంట్‌ అధికారులకు అందజేస్తామని డిప్యూటీ మంత్రి ఇలియా డెనిసొవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
మధ్యప్రాచ్యంలో సుస్థిరత కోసం ఈజిప్టుతో కలిసి పనిచేస్తాం : జిన్‌పింగ్‌
మధ్య ప్రాచ్యంలో మరింత సుస్థిరత నెలకొనేలా చూసేందుకు ఈజిప్ట్‌తో కలిసి పనిచేస్తామని చైనా నేత జిన్‌పింగ్‌ చెప్పారు. గురువారం ఈజిప్ట్‌ ప్రధానితో ఆయన మాట్లాడారు. ఈజిప్ట్‌తో సహకారాన్ని పెంచుకుని ఈ ప్రాంతంలో, తద్వారా ప్రపంచంలో మరింత సుస్థిరత తీసుకురావాలన్నది చైనా అభిమతమని ఆయన పేర్కొన్నారు. చైనా, ఈజిప్ట్‌లు మంచి మిత్రదేశాలని, ఒకే లక్ష్యాలను కలిగి వున్నాయని, పరస్పరం విశ్వాసం కలిగి వున్నాయని పేర్కొన్నారు.
పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోడీ
గాజా ఆస్పత్రిపై దాడి జరిగిన నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆ దాడిలో అమాయకులు అశువులు బాయడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనియన్లకు మానవతా సాయాన్ని పంపడాన్ని భారత్‌ కొనసాగిస్తుందని చెప్పారు. ఆ ప్రాంతంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, హింస, తీవ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌-పాలస్తీనా సమస్యపై భారత్‌ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న సూత్రబద్ధ వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని భారత్‌ పిలుపిచ్చింది.
జోర్డాన్‌, ఈజిప్ట్‌ చర్చలు
మరోవైపు రాఫా క్రాసింగ్‌ మీదుగా మానవతా సాయాన్ని అనుమతించేందుకు వీలుగా గాజా క్రాసింగ్‌ వద్ద దెబ్బతిన్న రోడ్లను ఈజిప్ట్‌ మరమ్మత్తు చేస్తోంది. జోర్డాన్‌ రాజుతో గురువారం ఈజిప్ట్‌ అధ్యక్షుడు సిసి భేటీ అయ్యారు. గాజాలో క్షీణిస్తున్న పరిస్థితులను చర్చించారు. పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఉమ్మడిగా శిక్షను అమలు చేస్తున్న ఇజ్రాయిల్‌ విధానాన్ని వారు ఖండించారు. పాలస్తీనియన్లను వారి ఇళ్ల నుండి వెళ్లగొట్టి ఈజిప్ట్‌కు, జోర్డాన్‌కు పంపేయాలని చూస్తోందని విమర్శించారు. గాజాపై దాడుల గురించి టర్కీ, ఈజిప్ట్‌ మంత్రులు కూడా చర్చించారు.
ఇజ్రాయిల్‌ దాడిలో ముగ్గురు పాలస్తీనా వాసుల మృతి
గాజాలో రక్తపాతం సాగిస్తున్న ఇజ్రాయిల ఇంకా బుల్లెట్ల వర్షం కురిపించి, పాలస్తీనియన్లను బలితీసుకుంటోంది. గురువారం వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిలీ బలగాలు జరిపిన కాల్పుల్లో 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసున్న టీనేజర్లుసహా ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు.