
నవతెలంగాణ – చండూరు
పార్లమెంట్ ఫలితాలలో మునుగోడు నియోజకవర్గం నుండి అధిక మెజార్టీ ఉండాలి అని భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బూత్ కమిటీల ఇన్చార్జి ,బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలోని 119 నియోజవర్గాలలో కంటే మునుగోడు నియోజకవర్గానికి రాజకీయ చైతన్యం ఎక్కువ అని మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర లో నిలిచిపోయే విధంగా జరిగిన పోరులో మునుగోడు కు పోరాటాల గడ్డ అని పేరు వచ్చిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక మెజార్టీ మునుగోడు నియోజకవర్గం నుండి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, భూత్ ఇన్చార్జులు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని అన్నారు. స్థానిక ఎన్నికలలో కష్టపడిన వారికే అవకాశాలు ఉంటాయి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం బీజేపీ బీఆర్ఎస్ నుండి పార్టీలో చేరేందుకు గ్రామస్థాయిలలోనే బూత్ ఇన్చార్జీలు బూత్ సభ్యులు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, గట్టుప్పల కాంగ్రెస్ మండల అధ్యక్షులు నామని జగన్నాథం , దండు యాదగిరి రెడ్డి, నామని గోపాల్, సంపత్,చామల యాదయ్య, భీమగాని మల్లేష్, ఐలయ్య , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.