పారిస్‌లో జైలు వ్యాన్‌పై దుండగుల దాడి

– ఇద్దరు అధికారులు మృతి, తప్పించుకున్న ఖైదీ
పారిస్‌ : ఖైదీని తీసుకువెళుతున్న ఒక జైలు వ్యాన్‌పై మంగళవారం దాడి జరగడంతో ఇద్దరు జైలు అధికారులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈలోగా ఆ ఖైదీ కూడా తప్పించుకుని పారిపోయాడని పారిస్‌ పోలీసు వర్గాలు న్యాయ శాఖ మంత్రి ఎరిక్‌ దూపాండ్‌ మొరెటికి తెలిపాయి. ఉత్తర ఫ్రాన్స్‌లోని ఇంకారవిల్లె ఏరియాలో ఈ దాడి జరిగింది.