– ‘లెనిన్ ఓ విప్లవాయుధం’ పుసక్తంపై సామూహిక పఠనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెడ్ బుక్స్ డే కార్యక్రమం జరగనుంది. ‘లెనిన్ ఓ విప్లవాయుధం’అనే పుస్తకంపై సామూహిక పఠన కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, హైదరాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులు పాల్గొంటారు.