ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

– జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌ రాజ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, గృహనిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ (స్మార్ట్‌ గవర్నెన్స్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌ రాజ్‌, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) ముఖ్య కార్యదర్శిగా బెనహర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా ఎస్‌.హరీష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హన్మకొండ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) రాధిక గుప్తాను మేడ్చల్‌ – మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) గా బదిలీ చేశారు.