
విజయపురి నార్త్ ఎస్.ఐ సంపత్ మాట్లాడుతూ…ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని సూచించారు. మద్యం సేవించి, అతి వేగంగా వాహనాలు నడపవద్దన్నారు. నియమాలు ఉల్లం ఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా వాహనదారులు ప్రమాదాలకు గురై తరుచుగా మృత్యువాత పడతున్నారని అన్నారు. వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రిబుల్, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.నాగార్జునసాగర్ సర్కిల్ పరిధిలోని పెద్దవూర ,తిరుమలగిరి సాగర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
|