
మండల పరిధిలోని దేవుల తండా గ్రామానికి చెందిన సభావాట్ బాబు నాయక్ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఎంపికయ్యాడు. 68.వ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈనెల 10 నుండి 14 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో లో జరగనున్నాయి. టోర్నమెంట్లో జాతీయ రిఫరీ పరీక్షకు ఎంపిక అయినట్లు బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.