సర్ సి.వి.రామన్ కి ఘన నివాళి 

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని సర్ సి.వి.రామన్ ఉన్నత పాఠశాలలో ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాయిత నారాయణరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పరిశోధన ద్వారా ప్రఖ్యాత నోబెల్ బహుమతిని పొంది భౌతిక శాస్త్రంలో ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి సర్ సి వి రామన్ అన్నారు. భారతదేశ పేరు ప్రఖ్యాతలను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసేల చేశారని, విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ప్రఖ్యాత శాస్త్రవేత్తలుగా ఎదిగి మన మాతృభూమికి గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.