మండలనికి బదిలీపై వచ్చిన మండల తహసిల్దార్ శేఖర్ కు మండలం భారతీయ జనతా పార్టీ శాఖ తరపున మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి చింత ప్రవీణ్ రెడ్డి, ఆర్మూర్ నియోజక వర్గం ఓబిసి మోర్చా కన్వీనర్ గంగోని వినోద్, మండల కోశాధికారి & శక్తి కేంద్రం ఇంచార్జి దేదావత్ రమేష్ నాయక్, కార్యదర్శి &శక్తి కేంద్రం ఇంచార్జి కందురి సంజీవ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు దామా రాజేశ్వర్, బీజేపీ నాయకులు మాదాపూర్ మాజీ సర్పంచ్ భోజన్న, మాజీ ఎంపీటీసీ అర్. రాజ్ కుమార్ పాల్గొన్నారు.