
పిడుగుపాటుకు రెండు ఆవులు మృత్యువాత పడిన ఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం లోని గెమ్యనాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని జగ్రాం తండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నేనావత్ సామ్య అనే రైతు తనకు వున్న రెండు ఆవులను రోజులాగే పొలంలో మేపుతుండగా సుమారు మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదైంది. ఈ క్రమంలో ఒకే సారి పిడుగు పాటుకు గురై పొలంలో మేసుతున్నా రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందింనని.సామ్య రైతు వ్యవసాయ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు.సుమారు రూ.90 వేల విలువ గల రెండు ఆవులు మృతి చెందడంతో తాను జీవనోపాధి కోల్పోయానని రైతు సామ్య కుటుంభ సభ్యులు బోరున విలిపించారు. వ్యవసాయమే అధారంగా బ్రతుకుతున్న తనకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు. మృతి చెందిన ఆవులను చూడడానికి చుట్టూ పక్కల గ్రామాలనుంచి తరలి వచ్చి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి వెళుతున్నారు.