
జిల్లాలో మిగిలి ఉన్న ఉపాధి కూలీలా బ్యాంక్ అక్కౌంట్ కు ఆధార్ అనుసంధానం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు డి ఆర్ డి ఓ సిబ్బంది పోస్టల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న వారికి వేసవి లో ఎక్కువ పనులు కల్పించాలని సూచించారు. జిల్లాలోని ఇంకా 8925 మంది ఉపాది హామీ పథకం కూలీలకు ఆధార్ కు బ్యాంకు అకౌంటు అనుసందానం చేయవలసి ఉందని (ఎన్ పి సి ఐ), అట్టి పనులను సత్వరమే పూర్తి చేసి కూలీలకు సకాలంలో వేతనాలు అందే విధంగా చూడాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ జి. మధుసూదన రాజు,పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.