– వర్షాలు, వరద పరిస్థితులపై ఆరా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర హోం మంత్రి అమిత్షా సీఎం రేవంత్రెడ్డికి ఆదివారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితులను అడిగి తెలసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదల వల్ల వాటిల్లిన ఈ సందర్భంగా సీఎం జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు అవసరమైన తక్షణ సహయాన్ని అందిస్తామనీ, కేంద్ర ప్రభుత్వం తరుపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లతో నేరుగా సీఎం మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసానిచ్చారు.