రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చింతల రాజలింగం ఆధ్వర్యంలో 57,ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు సమావేశం మంగళవారం హైదరాబాదులో నిర్వహించినారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మాజీ డి.ఎస్.పి, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి మదానం గంగాధర్ కు రాష్ట్ర 57ఉపకులాలు ఐక్య వేదిక మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.