జో శర్మ హీరోయిన్గా దర్శక, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ఎంఫోర్ఎం’ (మోటీవ్ ఫర్ మర్డర్). ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, ‘వరల్డ్వైడ్గా అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్తో దీన్ని రూపొందించాం. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్ట్తో ఈ సినిమా చేశాం. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకం ఉంది. ఈ చిత్ర హిందీ ట్రైలర్ను ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విడుదల చేయడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు భారీగా పెరిగయి. హీరోయిన్ జో శర్మ నటన సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. విడుదలైన ఫస్ట్ డే ఈ సినిమా చూసి, ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాం’ అని తెలిపారు. ‘మోహన్ వడ్లపట్ల నాకు గాడ్ఫాదర్. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం అమెరికా నుంచి హైదరాబాద్కు ఈ ఏడాదే ఆరు సార్లు వచ్చాను. నేను ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చేశాను. క్షణక్షణం ఉత్కంఠతో నడిచే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఊపిరి బిగబట్టేలా ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లందరి ఫీలింగ్ ఇదే. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అని హీరోయిన్ జో శర్మ చెప్పారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ను ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే విడుదల చేయబోతున్నారు.