స్వచ్ఛదనం పచ్చదనం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఊరూరా మండల ఎంపిడిఓ శ్యామ్ సుందర్, తహశీల్దార్ రవికుమార్, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృతంగా చేపట్టారు.గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు, డ్రైనేజీల్లో చెత్త,చెదారం తొలగించి సీజనల్ వ్యాధులు రాకుండా బ్లీచింగ్ పౌడర్ పారిశుధ్య సిబ్బందితో చల్లించారు. ఈగలు,దోమలు వ్యాప్తి చెందకుండా పిచికారీ చేయించారు.