768 జీవాలకు గాలుకుంటు వ్యాధి నివారణ టీకాలు

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మానిక్ బండారు గ్రామంలో పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను పశు వైద్యులు కిరణ్ ధేశ్ పాండే, ఉమమా సహేర్ అధ్వర్యంలో బుదవారం వేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని 768 పశువులకు టీకాలు వేశమన్నరు. రైతులు తమ పశువులకు తప్పకుండా వ్యాధి నివారణ టీకాలను వేయించాలని తెలిపారు. విఎల్ఓ వినీత, జేవిఓ గంగ జమున, విఏ అహ్మద్ పాషా, గోపాల మిత్ర సుదీర్, వ్యాక్సినటార్ జైల్ సింగ్, సిబ్బంది శ్రీను, గంగాధర్, పుష్ప, లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.