వడ్డే ఓబన్న  విరోచిత పోరాటం భావితరాలకు చాటి చెప్పాలి..

Vadde Obanna's fierce struggle should be told to posterity..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం భావితరాలకు చాటి చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శనివారం రోజు కలెక్టరేట్ సమావేశం మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న 218 వ జయంతి వేడుకలలో పాల్గొని  వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓబన్న 1840 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశారు. ఈ ఉద్యమానికి ఓబన్న  చిన్న , సన్నకారు ,మధ్యతరగతి రైతులను సంచార జాతుల వారితో సుమారు పదివేల మందిని కూడగట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పేద రైతుల పక్షాన నిలబడి విరోచిత పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి , జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ జడ్పీ సీఈఓ శోభారాణి ,ఆర్ డి ఓ లు, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి,జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా అధికారులు బి సి కుల నాయకులు , సిబ్బంది పాల్గొన్నారు.