నవతెలంగాణ – అచ్చంపేట: పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజులపాటు ఉత్సవాల నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర ద్వారా దర్శనం , ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని నిర్వాహకులు కౌన్సిలర్ శివ తెలిపారు. ఆలయానికి 25000.విరాళం. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి బృంగి జ్యోతి , రాజశేఖర్ దంపతులు 25000 విలువచేసే డోలు, గంటా విరాళంగా ఇచ్చారు.. కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రసాద్ స్వామి, తదితరులు ఉన్నారు.