విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు వాల్మీకి ఫౌండేషన్‌ కృషి

– అనాథ పిల్లలను చేరదీసి వారికి ఉన్నత విద్య అందించడమే లక్ష్యం
– కష్ట పరిస్థితిలో జీవిస్తున్న పిల్లల అవసరాలను తీర్చడమే ముఖ్యం
– టర్కీ కన్సల్‌ జనరల్‌ ఓరాన్‌ యాల్మన్‌ ఓకన్‌, ఫౌండేషన్‌ అడ్వైజరీ బోర్డు సభ్యులు పద్మశ్రీ మంజుల అనగాని
నవతెలంగాణ-శంకర్‌పల్లి
వెనుకబడిన ప్రాంతాల వారికి విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు వాల్మీకి ఫౌండేషన్‌ ఎంతగానో కృషి చేస్తుందని టర్కీ కన్సల్‌ జనరల్‌ ఓరాన్‌ యాల్మన్‌ ఓకన్‌, ఫౌండేషన్‌ అడ్వైజరీ బోర్డు సభ్యులు పద్మశ్రీ మంజుల అనగాని అన్నారు. వాల్మీకి ఫౌండేషన్‌ 16వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని జన్వాడలో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై, మాట్లాడుతూ సమాజంలోని అణ గారిన వర్గాలు, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో జీవి స్తున్న పిల్లల అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉన్న లాభాపేక్షలేని అభివృద్ధి సంస్థ వాల్మీకి ఫౌండేషన్‌ అని అన్నారు. ఫౌండేషన్‌ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గత ఏడాది ప్రారంభించిన ఎండ్‌ పీరియడ్‌ పాపర్టీ కార్యక్రమం రెండోవ సంవత్సరం కూడా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఈ చొరవ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న బాలికలలో రుతుక్రమ పరిశుభ్రత ఉత్పత్తులకు అందుబాటులో లేని కొరతను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. శంకర్‌పల్లి మండలంలోని ఇరవై ఐదు ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఈ రోజు వెయ్యి స్కూల్‌ బ్యాగులు, ఆరువేల నోటు పుస్తకాలు,స్టేషనరీ కిట్‌, స్పోర్ట్స్‌ కిట్లు, లైబ్రరీ సెట్‌ అఫ్‌ బుక్స్‌ , గ్రామీణ విద్యార్థినుల విద్యను ప్రోత్సహించడాని కాలి నడకన వచ్చే విద్యార్థినులకు ఇరవై సైకిళ్లు, ఇతర అవసరమైన సౌకర్యాలను అందించినట్టు వారు తెలిపారు. పేద పిల్లల కోసం ఇన్ని అవసరాలు తీరుస్తున్న ఈ వాల్మీకి ఫౌండేషన్‌ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ గణేష్‌ వాల్మీకి ప్రధాన కార్య దర్శి హరికిషన్‌ వాల్మీకి సంయుక్త కార్యదర్శి పుష్ప వాల్మీకిలు మాట్లాడుతూ పేద పిల్లల చదువులకు, వారి జీవించడానికి కోసం ఈ ఫౌండేషన్‌ ఎంతో కృషి చేస్తుందన్నారు. వాల్మీకి ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీ సూర్య గణేష్‌ వాల్మీకి ఈ వార్షికోత్సవ వేడుకల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ మహత్తర సందర్భంలో పేదరికం అంతం కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషకరమన్నారు. ఈ ప్రాంతంలో పదివేల శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేయడంతో ‘ఎండ్‌ పీరియడ్‌ పావర్టీ’ ప్రచారం రెండవ సంవత్సరంలోకి ప్రవేశించింది. రాబోయే నెలల్లో ప్రత్యేక మొబైల్‌ పంపిణీ యూనిట్‌ ద్వారా తెలంగాణ అంతటా గ్రామీణ గిరిజన ప్రాంతాలకు తన పరిధిని విస్తరిం చాలని ఈ కార్యక్రమ లక్ష్యమని తెలియజేశారు. ధోబీపేట్‌లోని ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించాలని ఫౌండేషన్‌ యోచిస్తోందని, వెనుకబడిన ప్రాంతాలలో విద్య మౌలిక సదు పాయాలను మెరుగుపరచాలని ఫౌండేషన్‌ నిర్వా హకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రోహిణి రేగంటి, డాక్టర్‌ శివానంద్‌ రెడ్డి, వివేక్‌ వర్మ, మండల వైస్‌ ఎంపీపీ ప్రవళిక వెంకట్‌ రెడ్డి, జన్వాడ ఎంపీటీసీ నాగేందర్‌, మిర్జాగూడ మాజీ సర్పంచ్‌ రవీందర్‌ గౌడ్‌, జన్వాడ మాజీ సర్పంచ్‌ లలిత నరసింహ, మండల విద్యాధికారి సయ్యద్‌ అక్బర్‌, సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్‌, వివిధ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు నరహరి, జయసింహారెడ్డి, నర్సింగ రావు, దేవేందర్‌ రెడ్డి, తహేర్‌ అలీ, ఉపాధ్యాయులు, వెయ్యి మంది విద్యార్థులు, ఫౌండేషన్‌ వాలంటీర్స్‌, తదితరులు పాల్గొన్నారు.