వరలక్ష్మికి సాహిత్యంలో జాతీయ స్థాయి అవార్డు 

నవతెలంగాణ కంఠేశ్వర్ 
శ్రీ ఆర్యన్ సకల కళా వేదిక శ్రీ గౌతమేశ్వర సాహితీ సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా కరీంనగర్ జిల్లాలోని ఫిలిం భవన్ లో విభిన్న రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు నిన్న జాతీయ స్థాయి చతుర్ముఖ సింహ అవార్డులను అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డొంకేశ్వర్ మండలం, తొండాకూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ వరలక్ష్మి 500 లకు పైగా కవితలు, 280 పైగా చిత్రాలు, 20 పాటలు, 30 కథలు రాసి సాహిత్యంలో రాణిస్తున్నందున జాతీయస్థాయి చతుర్ముఖ సింహ అవార్డును ప్రధానం చేశారు . ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దూడపాక శ్రీధర్, ముఖ్య అతిథి డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ , గౌరవ అతిది పొర్ల వేణుగోపాల్ రావు కాసారం, కళాభారతి సీనియర్ బ్యూటీషియన్ లావణ్య కవులు, కళాకారులు పాల్గొన్నారు.