నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లాలోని వాణిజ్య, వాణిజ్యేతర వాహనదారులు తమ వాహన పన్ను రవాణా శాఖకు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వీ లక్ష్మణ్ పేర్కొన్నారు. పన్ను చెల్లించని వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే సంబంధిత వాహనం పన్నుపై అపరాధ రుసుం మొదటి నెల 50 శాతం, రెండో నెల 100 శాతం, మూడో నెలలో 200 శాతం అదనంగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని వాణిజ్య, వాణిజ్యేతర వాహనదారులు గమనించి సకాలంలో తమ వాహన పన్నును చెల్లించాలని సూచించారు.