
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్ ఐదు జిల్లాల యువశక్తి అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా బండి సుధాకర్ సూచన మేరకు (ఏఎస్ యు) విద్యార్థి సంఘం కాటారం సబ్ డివిజన్ అధ్యక్షుడుగా మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన వేల్పుల మహేందర్ ను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక,రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్,కు మార్ యాదవ్, బండి సుధాకర్ లకు మహేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యుయు మహిళ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు కొండ రాజమ్మ,కాటారం సబ్ డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమత,మండల అధ్యక్షురాలు ఏనుగు నాగరాని, పాల్గొన్నారు.