పాయల్ రాజ్పుత్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘వెంకటలచ్చిమి’. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్బంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ.. ”వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్పుత్ సరిగ్గా సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా ఇండియన్ ఇండిస్టీలో ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం’ అని అన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ,’మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. డైరెక్టర్ ముని ఈ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్కి నెక్ట్స్ లెవల్గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ముని, మ్యూజిక్ డైరెక్టర్: వికాస్ బడిశా, ప్రొడ్యూసర్: రాజా, ఎన్ఎస్ చౌదరి.