విజయ్ సినిమా కెరీర్లో ఆఖరి చిత్రం ‘దళపతి 69’ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్ ప్రొడక్షన్స్. సినిమాలో నటించే నటీనటులు, పని చేసే సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరగటం విశేషం. శనివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. విజరు కెరీర్లో ఇదొక హిస్టారిక్ ప్రాజెక్ట్. సిల్వర్స్క్రీన్ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం ఇదే. అలాగే విజరు ఫ్యాన్స్కి ఇదొక ఎమోషనల్ ప్రాజెక్ట్. విజయ్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తారు. గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కేవీయన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. ప్రదీప్ ఇ రాఘవ్ ఈ సినిమాకు ఎడిటింగ్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సెల్వ కుమార్ ఆర్ట్ డైరక్టర్గా పనిచేస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీలో వచ్చే ఏడాది అక్టోబర్లో ఈ సినిమా విడుదల కానుంది.