అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం లో ఇంటర్ విద్యార్థులకు వాలీబాల్ పోటీలు నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎబివిపి ప్రాంత సహా సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని వారు అన్నారు. విద్యార్థులందరూ కూడా డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ, యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ జూపల్లి దీపిక, నగర కార్యదర్శి గద్ద నితిన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవింద్, హర్షవర్ధన్ అభి మని సాయి,దీపక్,సాయి లు పాల్గొన్నారు.