అడిషనల్ కలెక్టర్ సిసిపై దాడిని ఖండిస్తున్నాం 

– గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు దుబాసి మాణిక్యం
నవతెలంగాణ –  కామారెడ్డి
అడిషనల్ కలెక్టర్ సిసి రాజశేఖర్ పై బిక్కనూర్ టోల్ ప్లాజా సిబ్బంది దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు దుబాసి మాణిక్యం తెలిపారు. శుక్రవారం ఆయిన విలేకరులతో మాట్లాడుతూ టోల్ ప్లాజా సిబ్బంది వచ్చిపోయే ప్రయాణికులను రక్షించే వారిగా ఉండాలి గాని శిక్షించే వారికి ఉండకూడదన్నారు. టోల్ ప్లాజా సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగినప్పుడు  ఒక వేళ ప్రమాదం జరిగి మనుషులు తీవ్ర గాయాలైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలనీ, ఒకవేళ వాహనము చెడిపోతే ఆ ఏరియాలో ఉన్న మెకానికులకు ఫోన్ చేసి పిలిపించి సహాయపడాలి గాని వారే ప్రయాణికుల మీద దాడి చేయడం అది సహించరాని నేరంగా భావిస్తున్నాము అన్నారు.
రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు.ఎన్నో ప్రమాదాలు జరుగుతాయనీ, చాలామంది ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయనీ, వాహనాలు చెడిపోతాయి వారికి సహాయం చేసే వారిగా ఉండాలి  సరైన పద్ధతిలో సమాచారం ఇవ్వాలన్నారు. అవసరమైతే ఆ ఆ టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నటువంటి వారికి సమాచారం ఇవ్వాలి, స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఇంకా ఎమర్జెన్సీ ఉంటే 108కి సమాచారం ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా టోల్ ప్లాజా సిబ్బంది వాళ్ళ యజమాన్యం పద్ధతి మార్చుకొని ప్రయాణికులకు సౌకర్యార్థంగా ఉండాలని, మా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ సిసి  మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మున్మందు ఇలాంటి దాడులు గనుక జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు.  అలాంటి దాడులు జరగకుండా యజమాన్యం సరైన చొరవ చూపి ఆ రోడ్ల వెళ్తున్న ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించాలని మా సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను అన్నారు.