ముందే హెచ్చరించాం

– కేంద్రహౌంమంత్రి అమిత్‌షా
– అబద్ధం : సీఎం పినరయి
వయనాడ్‌: ” కేరళలోని వాయనాడ్‌లో విపత్తుపై కేంద్రం ముందుగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించలేదు. అధికారులు హెచ్చరిక జారీ చేయడానికి ముందే కొండచరియలు విరిగిపడ్డాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు ఇది సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి” అని కేరళ సీఎం పినరయి విజయన్‌ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుపై జులై 23నే తెలియజేసి రాష్ట్రాన్ని అప్రమత్తం చేశామని.. అయినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని రాజ్య సభలో అమిత్‌ షా ప్రకటించారు. తక్షణమే అప్రమత్తమై ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేదన్నారు. ఆయన చేసిన ప్రకటనపై స్పందించిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.