– అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-కరీంనగర్ :
అత్యుత్తమ విద్య విధానాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణ పద్ధతులను చాలా స్ఫూర్తిదాయకంగా అమలు పరుస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్కు అమెరికాలోని నూయార్క్లో గ్రీన్ మెంటర్ అవార్డ్స్ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందజేయడం పట్ల పాఠశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యాధునిక వసతులతో విద్యనందిస్తూ విద్య విధానాలను విజయవంతంగా అమలుపరుస్తూ, సమాజానికి ప్రమాణికంగా నిలుస్తూ పరిరక్షణకు చేయూతనిస్తూ అగ్రగామిగా కొనసాగుతుందని చెప్పారు. పాఠశాలలో అందిస్తున్న ప్రతి వసతి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చెప్పారు. ప్రతి అంశాన్ని చక్కగా భోధిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ఉత్తమంగా కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పాఠశాల వార్షిక ప్రణాళికలో భాగంగా అపార అనుభవం గల ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణత్య విద్యతో పాటు సర్వతోముఖాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్నామని, సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. ఇటీవల అమెరికాలోని సూయ్యార్క్ నిర్వహించిన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా నిర్వహింపబడిన అంతర్జాతీయ గ్రీన్ స్కూల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో అతిరథ మహారథులు, ప్రఖ్యాత వ్యక్తుల చేతుల మీదుగా పాఠశాల అవలంభిస్తున్న పలు విద్య విధానాలను ప్రశంసిస్తూ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు రావడం ద్వారా విద్యాసంస్థల బాధ్యత మరింత రెట్టింపు అయిందని తెలిపారు.కాగా అవార్డు రావడంతో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేశారని, భారత దేశ విద్యా విధానానికి వన్నె తెచ్చారని పలువురు విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.