‘డివిజన్‌ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తాం’

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
డివిజన్‌ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని శేరిలింగంపల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ అన్నారు. శేరిలింగంపల్లి డివి జన్‌లోని గోపినగర్‌లో నూతనంగా చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణ పనులను శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా పాటించాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్డు పనులకు ఇరువైపులా ఉన్న ర్యాంపులను, అరువులను తొలగించి స్థానిక కాలనీవాసుల సౌలభ్యానికి రోడ్డు వెడల్పుగా ఉండేందుకు ర్యాంపులను, అరువులను తొలగించాలని సూచించారు. రోడ్డు పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ డివిజన్‌ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ రాజేశ్వరమ్మ, ప్రధా న కార్యదర్శి రవీందర్‌ గౌడ్‌, వార్డ్‌ మెంబర్‌ పర్వీన్‌ బేగం, సీనియర్‌ నాయకులు కేఎన్‌ రాములు, దాకయ్య గౌడ్‌, లీలానంద్‌ గౌడ్‌, కొయ్యాడ లక్ష్మణ్‌ యాదవ్‌, శ్రీకాంత్‌ దేవులపల్లి, మహేందర్‌ సింగ్‌, నర్సింహా, దస్తగి ర్‌, షైక్‌ రజాక్‌, నర్సింహా, సురేష్‌, గఫుర్‌, రియాజ్‌, ఉపేందర్‌, ముసలయ్య, రేణు, సాయి, సర్వేష్‌, మహిళా నాయకురాళ్లు దివ్య, నిరూప తదితరులు పాల్గొన్నారు.