– చెత్త నిర్వహణలో చిత్తశుద్ధి లేని జీహెచ్ఎంసీ
– రోజుల తరబడి రోడ్లపై పేరుకుపోతున్న చెత్త కుప్పలు
– కంపువాసనతో ప్రజలు ఇబ్బందులు
– జోనల్ కమిషనర్ పర్యటిస్తున్నా ప్రయోజనం శూన్యం
మన ఇంటితో పాటు మన చుట్టు పరిసరప్రాంతాలు పరిశభ్రంగా ఉండాలి. అప్పుడే అందరి ఆరోగ్యం బాగుంటుంది. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు మొండుగా ఉంటాయి. అలాంటి సమయంలోనైనా అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు కాలనీల్లో పర్యవేక్షణ నిర్వహించాలి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు ప్రజల పాట్లు, ఇక్కట్లు చూడటానికి మాత్రం రావట్లేదు. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని ఆయా డివిజన్లో చెత్త గుట్టలుగా పేరుకుపోయి పరిసరాలు అధ్వానంగా మారాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నవతెలంగాణ-మియాపూర్
వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకా శాలున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు చెత్తను తొల గించాలని, పరిశుభ్రత పాటించాలంటూ శేరిలిం గంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి ప్రతీ రోజూ ఎక్కడో చోట పర్యటిస్తూ కింది స్థాయి సి బ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటనలు చేస్తుం టారు. కానీ వాస్తవంలో మాత్రం ఎక్కడి చెత్త అక్క డే కనిపిస్తుంది. వీధులన్నీ చెత్తతో నిండిపోతు న్నా యి. నిర్వహణ లోపంతో పలు డివిజన్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొన్నిచోట్ల రోజుల తరబడి చెత్తను తొలగించక పోవడంతో ఆవైపు నుండి వెళ్లాలం టేనే జనాలు దుర్గంధంతో ముక్కుమూసుకుని పో వాల్సి వస్తుంది.
వందలాది మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, చె త్త తొలగింపు నిర్వహణ చూసేందుకు ఎస్ఎఫ్ఏ లు, ఏఎంఓహెచ్ అంటూ పలువురు అధికారులు ఉన్నా నిర్వహణ మాత్రం అధ్వానంగా మారింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో జనాలకు ఇ బ్బందులు తప్పడం లేదు. వర్షాలవల్ల వ్యర్థాలు కు ళ్లిపోయి దోమలు విజంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలతో జనాలు ఆస్పత్రుల్లో చేరు తున్నారు.
గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధి లో ని ఆయా డివిజన్లలో చెత్త నిర్వహణ అత్యంత అధ్వానంగా మారింది. గచ్చిబౌలి డివిజన్ లో ప లు ప్రాంతాల్లో రోజుల తరబడి చెత్తను తొలగిం చక పోవడంతో గుట్టలుగా పేరుకు పోయింది. ఇక స్లమ్ ఏరియాల్లో అయితే 15 రోజులకు ఒక్క సారి కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది రారని స్థాని కు లు చెబుతున్నారు. శేరిలింగంపల్లిలోనూ ఇదే పరి స్థితులు కనిపిస్తున్నాయి. తారానగర్, శివాజీ నగర్లలో రోడ్ల పక్కనే చెత్త గుట్టలుగా పేరుకు పోయింది. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో రోజుల తరబడి చెత్త అలాగే ఉంటుందని, జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేది స్థానికులు మండిపడుతున్నారు. ఇక మి యాపూర్, మదీనాగూడ, ఎంఏనగర్, స్టాలిన్ నగర్, మైత్రీనగర్, హఫీజ్ పేట్, ప్రేమ్ నగర్, ఇం ద్రారెడ్డి అల్వీన్ కాలనీ ఇలా అనేక ప్రాంతాల్లోనూ చెత్త నిర్వహణలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిరక్ష్యం గా వ్యవహరిస్తున్నారు.
రోజుల తరబడి తొలగించరు
అత్యవసర సమయాల్లోనూ శేరిలింగంపల్లి జోనల్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు పెద్దగా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వర్షాలు పడిన సమ యంలో మాత్రమే కాదు నేటికి జీహెచ్ఎంసీ సిబ్బంది, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చందానగర్, మియా పూర్, హఫీజ్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలిం గంపల్లి, కొండాపూర్ డివిజన్లలో వీధుల్లో పేరుకు పోయిన చెత్త చెదారాన్ని తొలగించక పోవడం జీ హచ్ఎంసీ అధికారుల, సిబ్బందికి నగర పరిశుభ్ర తపై ఎంతటి చిత్తశుద్ధి ఉందనేది అర్థం అవు తుం దని పలువురు మండిపడుతున్నారు.
జడ్సీ పర్యటిస్తారు.. డీసీలు పట్టించుకోరు
భారీ వర్షాలతో ఎక్కడా వరద నీరు నిల్వకుం డా చూడాలి, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి అంటూ తరచూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల లో పర్యటిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తు న్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో ఉదయమే పలు చోట్ల పర్యటించి హడావుడి చేస్తున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా పరిస్థి తుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. జెడ్సీ పర్య టనలు చేస్తూ చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్ర తపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుం టే డీసీలు, ఆ కిందిస్థాయి సిబ్బంది మాత్రం కనీ సం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపి స్తు న్నాయి. డిప్యూటీ కనిషనర్లు సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, చెత్త నిర్వహణతో పాటు ఆయా అంశాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యా లయం నుండి శేరిలింగంపల్లికి జెడ్సీగా ఉపేందర్ రెడ్డి వచ్చాక భారీమార్పులు ఉంటాయని ఆశించి న శేరిలింగంపల్లి ప్రజానీకానికి నిరాశ తప్పడం లే దు. చెత్త నిర్వహణతో పాటు అభివృద్ధి విషయం లో శేరిలింగంపల్లి గతంలో కంటే అధ్వాన్నంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.