రాహుల్‌ గాంధీ అక్కడికెందుకు వెళ్లరు?

RAHUL – నెలన్నర నుంచి ఒక్క ర్యాలీ కూడా నిర్వహించలేదు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ముందస్తు హెచ్చరికనా..?
జైపూర్‌ : రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉనికి కనిపించడం లేదు. నవంబర్‌ 25న ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈసారి కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హౌరాహౌరీ పోటీ కనిపిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కుస్తీ పడుతోంది. కాంగ్రెస్‌ కూడా ఏ విధంగానూ బలహీనంగా కనిపించడం లేదు. కానీ, రాజస్థాన్‌లో రాహుల్‌ గాంధీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చివరిసారిగా సెప్టెంబర్‌ 23న జైపూర్‌ వచ్చారు. ఇది దాదాపు ఒకటిన్నర నెలల క్రితం జరిగింది. మరోవైపు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అక్టోబర్‌లో రాజస్థాన్‌లో మూడు ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీ గెలుపొందడం ఖాయమని, 1993 నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. 2018లో కాంగ్రెస్‌ బీజేపీని అధికారం నుంచి దించింది.రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంపై ఫోకస్‌ పెంచుతారని, రాజస్థాన్‌లో వారి కోసం అనేక ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తారని షెడ్యూల్‌ చేశారు
హైకమాండ్‌తో గెహ్లాట్‌కు …
గత ఏడాది సెప్టెంబర్‌ 25న కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి)లో చేరాలన్న సూచనలను ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో పాటు తన మద్దతు ఎమ్మెల్యేలు తిరస్కరించినప్పటి నుంచి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆయనపై అసంతప్తిగా ఉందనడంలో సందేహం లేదు. ఈ ఉత్తర్వులను 92 మంది ఎమ్మెల్యేలు తిరస్కరించారు. బదులుగా, వారందరూ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి శాంతి కుమార్‌ ధరివాల్‌ నివాసంలో సమావేశమయ్యారు. అసెంబ్లీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని బెదిరించారు. సచిన్‌ పైలట్‌ లేదా అతని మద్దతుదారులను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే, తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.
హైకమాండ్‌ సూచనలను గెహ్లాట్‌ బేఖాతర్‌
రాష్ట్ర కాంగ్రెస్‌ యూనిట్‌లో తలెత్తిన ప్రతిష్టంభనను ముగించే బాధ్యతను ఇద్దరు కేంద్ర పరిశీలకులు మల్లికార్జున్‌ ఖర్గే, అజరు మాకెన్‌లకు అప్పగించారు. సమాంతర సమావేశాలు నిర్వహించినందుకు ధరివాల్‌, మహేష్‌ జోషి మరియు ధర్మేంద్ర రాథోడ్‌లపై క్రమశిక్షణా చర్యలకు ఇద్దరూ సిఫార్సు చేశారు. ఈ సంఘటన తర్వాత, గెహ్లాట్‌ , గాంధీ కుటుంబం మధ్య సంబంధాలు క్షీణించడం ప్రారంభించాయి. అంతకుముందు, గెహ్లాట్‌ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయులలో ఒకరిగా పరిగణించబడ్డారు.
రాహుల్‌ ప్రమోషన్‌లో గెహ్లాట్‌దే పెద్ద హస్తం
2006లో హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ జనరల్‌ కాన్ఫరెన్స్‌లో రాహుల్‌ గాంధీని జనరల్‌ సెక్రెటరీగా నియమించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గెహ్లాట్‌ సలహా ఇచ్చారనేది వాస్తవం. అంతేకాదు యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ బాధ్యతలు కూడా ఇవ్వాలని రాహుల్‌ గాంధీకి సూచించారు. చివరికి 2007లో గెహ్లాట్‌ ప్రతిపాదనకు సోనియా గాంధీ తన సమ్మతిని తెలియజేశారు. జనవరి 2023లో జైపూర్‌లోని ‘చింతన్‌ శివిర్‌’లో గెహ్లాట్‌ నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2007లో రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా నియమించడంలో గెహ్లాట్‌ పెద్ద పాత్ర పోషించారు.
గెహ్లాట్‌పై గాంధీ కుటుంబానికి ఎంతో నమ్మకం ఉంది అంటే సోనియా గాంధీ స్వయంగా గెహ్లాట్‌కు ఈ పార్టీ పగ్గాలను అప్పగించాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌ 25న జరిగే సీఎల్పీ సమావేశం తర్వాత గెహ్లాట్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీలోని సమీకరణాలను మార్చేశాయి. అయితే, గెహ్లాట్‌ , అతని మద్దతుదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించింది.

పైలట్‌ పట్ల మెతకగా రాహుల్‌ వైఖరి…
జోషి, రాథోడ్‌లకు టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నిరాకరించింది. గెహ్లాట్‌ పదే పదే చేసిన అభ్యర్థనల మేరకు ధరివాల్‌కు టిక్కెట్టు ఇచ్చారు. కానీ, దీని కోసం గెహ్లాట్‌ చాలా పాపడ్‌ రోల్‌ చేయాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ బలం ఏపాటిదో రుజువైంది. మరోవైపు, పైలట్‌కు సీఎం బాధ్యతలు ఇవ్వాలని ప్రియాంక గాంధీ నిరంతరం పట్టుబడుతున్నారు. పైలట్‌ తిరుగుబాటు తర్వాత, పార్టీ హైకమాండ్‌తో సయోధ్య కుదుర్చుకోవడంలో ప్రియాంక కూడా పెద్ద పాత్ర పోషించారు. మరోవైపు, పైలట్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఏకకాలంలో ఉండలేరని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. కానీ, గతేడాది జరిగిన సీఎల్పీ సమావేశం తర్వాత గెహ్లాట్‌ వైఖరిని చూసి ఆయన తన వైఖరిని మెత్తగా మార్చుకున్నారు.