ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

– జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ
– సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్‌
నవతెలంగాణ-మియాపూర్‌
ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్టాండింగ్‌ కమిటీ లో కృషి చేస్తానని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ నెంబర్‌ మియాపూర్‌ కార్పొరేటర్‌ శ్రీకాంత్‌ అన్నారు. స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మియాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ..ఆదివారం ఏఏస్‌ రాజునగర్‌, జేపీనగర్‌ కాలనీవా సులు, అభినందన సభ ఏర్పాటు చేసి తనకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏఏస్‌ రాజునగర్‌, జేపీనగర్‌ కాలనీ వాసులకు అసోసియేషన్‌ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రజా సమస్యలను స్టాండింగ్‌ కమి టీలో ప్రస్తావించి సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తా నన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను గుర్తించి విశేష అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏఏస్‌ రాజునగర్‌, జేపీనగర్‌ కాలనీల వాసులు అసోసియేషన్‌ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.