సప్త సముద్రాలు దాటి వస్తావా..

Will you come across the seven seas?పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఓ కన్నడ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. రక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. ఈ సినిమా కన్నడలో సూపర్‌ హిట్‌ అందుకుంది. హేమంత్‌ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఈనెల1న కన్నడ ప్రేక్షకుల ముందుకి వచ్చి క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌ని అనౌన్స్‌ చేసిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈనెల 22న ఈ మూవీని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ’లతో రక్షిత్‌శెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ చెప్పారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత.