– ఎస్పీ అపూర్వరావు
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ అధికారులు సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు.ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వచ్చిన పిర్యాదులు భూ సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యల పైన పిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన...
నవ తెలంగాణ – నార్కట్ పల్లి
గత 140 రోజులుగా సాగుతున్న తమ నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు విశ్వవిద్యాలయం ఆవరణలో సోమవారం టెంటు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయమైన తమ డిమాండ్ ను ప్రభుత్వం స్పందించి క్రమబద్ధీకరించాలని కోరారు. క్రమబద్ధీకరణ జరిగే వరకు నిరసనలు వివిధ రూపాల్లో తెలియజేయునట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రుడు, రవీందర్ రెడ్డి, మౌనిక, శంకరాచారి, శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డి, మధుసూదన్ రెడ్డి అమరేందర్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.