రెగ్యులర్‌ షూటింగ్‌లో తెలుసు కదా..

 రెగ్యులర్‌ షూటింగ్‌లో తెలుసు కదా..హీరో సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్‌’ సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ తర్వాత తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ‘తెలుసు కదా’తో అలరించ బోతున్నారు. స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ చేస్తున్నారు. టాప్‌ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో సినిమాలని నిర్మించే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్‌ షెడ్యూల్‌. ఇందులో టాకీ సీన్స్‌, మ్యూజిక్‌ నెంబర్స్‌ షూట్‌ చేస్తున్నారు. రాశీ ఖన్నా మొదటి రోజు షూటింగ్‌లో సిద్దూతో కలిసి జాయిన్‌ అయింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్‌ మేకోవర్‌ కావడం, ఇంటెన్స్‌ ప్రీ-ప్రొడక్షన్‌ మూవీ గ్రాండ్‌ ప్రొడక్షన్‌ స్టాండర్డ్స్‌ను సూచిస్తుంది. నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి థమన్‌ ఎస్‌ సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్‌ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్‌ చేస్తున్నారు. నవీన్‌ నూలి ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, శీతల్‌ శర్మ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: నీరజ కోన.