జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా ప్రియతమ్, అంజన, విజరు, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నీ దారే నీ కథ’. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా చాలా ఘనంగా జరిగింది. నిర్మాత తేజేష్ మాట్లాడుతూ, ‘ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీంతోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అని అన్నారు. మంచి టెక్నికల్ వ్యాల్యూస్తో మ్యూజిక్ బ్యాక్డ్రాప్తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. బుడాపెస్ట్లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. గతంలో మిషన్ ఇంపాజిబుల్, పరసైట్, స్క్విడ్ గేమ్ వంటి చిత్రాలకు ఆర్కెస్ట్రా అందించిన టీం అదేవిధంగా బాలీవుడ్కి సంబంధించిన మ్యూజిషియన్స్తో చాలా గ్రాండ్గా చేసాం’ అని నిర్మాత శైలజ జొన్నలగడ్డ చెప్పారు. నిర్మాత, దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో కథనే ఎంజారు చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మ్యూజిక్ డిజైన్ చేయించాం. మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది అన్నారు.