ఈనెల 24న హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించే మెగా జాబు మేళ పోస్టర్ ను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీనవెని రాకేష్ యాదవ్, హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ అద్యక్షుడు సనత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ 24న తిరుమల గార్డెన్ లో హుస్నాబాద్ శాసన్ సభ్యులు,రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాల యువతి యువకులు, ముఖ్యంగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఈ జాబ్ మేళా కార్యక్రమంలో 60+ రకాల కంపెనీలు పాల్గొంటాయని 5000+ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఇంటర్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరి స్థాయిని బట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థి దశ నుండి నాయకునిగా ఎదిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థుల, యువకుల సమస్యలు తెల్సిన నాయకుడు కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలోని యువత నిరుద్యోగులుగా ఉండద్ధని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలోపట్టణ అద్యక్షుడు చెన్నవేణి విద్యా సాగర్, మండల అద్యక్షుడు పోచవేణి శ్రీశైలం, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంతాల శివారెడ్డి ,యువజన కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ ,బందెల హరీష్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీలు మ్యాదరవేణి శ్రీకాంత్, పోగుల కుమార్, ముడికే ప్రశాంత్, పట్టణ ఉపాధ్యక్షులు నగేష్, మండల ఉపాధ్యక్షుడు కమలహాసన్,మండల ప్రధాన కార్యదర్శి గణేష్, గట్టు సాయి కృష్ణ, పున్న రంజిత్ తదితరులు పాల్గొన్నారు.