సమాజ సేవలో యువత ముందుండాలి

– కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జగదీశ్వర్‌ గౌడ్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
యువత మంచి మార్గాన్ని ఎంచుకుని సమాజ సేవ లో మొదటి పెట్టుగా నిలవాలనేధి శ్రీ కృష్ణయూత్‌ ఆశ యమని, శ్రీకృష్ణ యూత్‌ వ్యవస్థాపకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి జగదీశ్వర్‌ గౌడ్‌ అన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని శేరిలింగంపల్లి డి విజన్‌ పరిధిలోని గచ్చిబౌలి రోడ్డు 1నెంబర్‌లో ఎన్నో ఏం డ్లుగా పూరిగుడిసెలో నివాసముంటున్న నిరుపేద కుటుం బానికి శ్రీ కృష్ణయూత్‌ అధ్యక్షులు అభిషేక్‌ గౌడ్‌ ముందు కు వచ్చి తన సొంత ఖర్చు రూ.3 లక్షలతో 2 గదుల రేకుల ఇల్లుని నిర్మించి మంగళవారం ఆ ఇంటిని వారికి శ్రీకృ ష్ణ యూత్‌వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్‌గౌడ్‌ అందించా రు. అయన మాట్లాడుతూ.. నవసమాజ నిర్మాణానికి కీల క పాత్ర యువతే అని, సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందన్నారు. శ్రీకృష్ణ యూత్‌ 1998సం నుంచి సమాజ నిర్మాణానికి ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూత్‌ ద్వారా ఎన్నో కార్యక్రమా లు చేపట్టారన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి తన భు జాలపై వేసుకొని ఒక నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టిం చి వారి జీవితంలో ఒక కలను సాకారం కావడానికి తోడ్ప డిని శ్రీకృష్ణ అధ్యక్షులు, సభ్యులను ధన్యవాదాలు తెలి పా రు. కార్యక్రమంలో జి.రాజు, కె.కుమార్‌, కె.భిక్షపతి, జి. యాదగిరి, మెహమ్ముద, అబ్దుల్‌సత్తార్‌, ఫారీద్‌, స య్యద్‌ పాషా, రాఘవచారి, లడ్డు, రాములు, అనిల్‌, టి. జయ రాం, గణేష్‌, మహేష్‌, హరీష్‌, శ్రవణ్‌చారి పాల్గొన్నారు.