– ఫిబ్రవరిలో విచారణ. సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరిలో విచారించనుంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై గతేడాది జులై 18న విచారణ జరిగింది. తరువాత సెప్టెంబర్ 11న సుప్రీంకోర్టు మరో విచారించింది. అయితే ఆ తరువాత ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ రాలేదు. జనవరి 16, 17, 18వ తేదీల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ గురువారం కూడా విచారణకు రాకపోవడంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం దృష్టికి సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకెళ్లారు. ముందస్తు బెయిల్కు సంబంధించిన పిటిషన్ను ఫిబ్రవరిలో విచారిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం తెలియజేసింది.