క్యాన్సర్‌పై అవగాహన అవసరం

– మాదాపూర్‌ డీసీపీ శిల్ప వల్లి
– ఏఓఐ ఆధ్వర్యంలో 4కే వాక్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముంద స్తుగా గుర్తించి వైద్యం అందిస్తే రోగం నయమ వుతుందని మాదాపూర్‌ డీసీపీ శిల్ప వల్లి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా నల్లగండ్లలో గల అమెరికన్‌ అంకాలజీ ఇన్స్టిట్యూట్‌ ఆస్పత్రి, సీటీజెన్‌ ఆస్పత్రి ఆధ్వ ర్యంలో నిర్వహించిన 4కే వాక్‌ను డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ క్యాన్సర్‌తో బాధప డుతున్న వారికి మనోధైర్యన్ని అందించాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం ఎంతో అభివద్ధి చెందిందని, వైద్య విధానంలో గణనీయమైన అభివద్ధి సాధించిందని, ఎటువంటి రోగాలనైనా పసిగట్టు గల సాంకేతికత అందు బాటులోకి వచ్చిందన్నారు. క్యాన్సర్‌ వ్యాధిపై వివిధ మాధ్య మాల ద్వారా జరుగుతున్న ప్రచారాలను అర్థం చేసు కొని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజల్లో క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్పొరేట్‌ ఆస్పత్రులపై ఉందన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగిన నాడే రోగాన్ని నయం చేయగలమని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆర్‌సీఓఓ డాక్టర్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలను అందించేం దుకు ఆస్పత్రి నిరంతరం అధిక ప్రాధాన్యత ఇస్తుంద న్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమా లను నిర్వహించేందుకు అమెరికన్‌ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్‌ ఎల్లప్పుడూ ముందుం టుందని తెలిపారు. ఈ సందర్భంగా నల్లగండ్ల నుండి బీహెచ్‌ఈ ఎల్‌ చెక్‌ పోస్ట్‌ వరకు వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజలతో కలిసి ప్ల కార్డులను చేతబట్టి క్యాన్సర్‌పై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిటి జెన్‌ ఆస్పత్రి ఫెసిలిటీ డైరెక్టలు ప్రవీణ్‌ కుమార్‌, అంకిత తోపాటు పలు విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.