– మార్చి 13న పోలింగ్
– ఎన్నికల నిర్వహణకు నోడల్ ఆఫీసర్ల నియామకం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం జారీచేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ తెలిపారు. ఈనెల 23న నామినేషన్లకు చివరి తేదీ కాగా, 24న స్క్రూట్నీ, 27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముందన్నారు. మార్చి 13వ తేదీన ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు నోడల్ ఆఫీసర్లను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
అధికారి పేరు హోదా అంశం
జి.వెంకటేశ్వర్లు ఎస్డీసీ బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు
పి.సరోజ ఏసీ(అడ్మీన్) ఎన్నికల సామాగ్రి
సంధ్య జేసీ(శానిటేషన్) మానవ వనరులు, సిబ్బంది నియామకం
పద్మజా సీఎంఓహెచ్ హెల్త్ కేర్ కార్యక్రమాలు
కె.నర్సింగ్రావు డీఈఈ(ఐటీ) ఐటీ కార్యక్రమాలు
శృతిఓజా ఏసీ(యూసీడీ) శిక్షణ కార్యక్రమాలు
సౌజన్య పీడీ,యూసీడీ శిక్షణ కార్యక్రమాలు
ఎన్.ప్రకాష్రెడ్డి డైరెక్టర్, ఈవీడీఎం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ట్రాన్స్ఫోర్ట్
ఎండీ జియావుద్దీన్ ఈఎన్సీ డీఆర్సీ, పోలింగ్ కేంద్రాలు
ముర్తుజా అలీ సీపీఆర్ఓ మీడియా సెల్, మీడియా మానిటరింగ్ సెల్
బాషా ఎస్టేట్ ఆఫీసర్ 24/7 కాల్ సెంటర్
మహేష్ కులకర్ణీ సీవీఓ రిపోర్టులు, రిటర్నులు
విజయభాస్కర్రెడ్డి ఎల్డబ్ల్యూఎస్ పోస్టల్ బ్యాలెట్