మండలిలో విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పాడి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
శాసనమండలిలో విప్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు…గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో ఆయనకు విప్‌ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.