రజక వృత్తిదారులకు బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించాలి

–  జూబ్లీహిల్స్‌ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్‌.
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్‌ను సవరించి రజక వృత్తిదారు లకు రూ. 1000 కోట్లు కేటాయించాలని తెలంగాణ రజకుల సంఘం జూబ్లీహిల్స్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. సంఘం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధుర నగర్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జోన్‌ అధ్యక్షులు రాపర్తి అశోక్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 59 కోట్లే కేటాయించిందని, ఇవి ఉచిత విద్యు త్‌కు సరిపోవన్నారు. రజకుల అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించి ప్రతీ రజక కుటుంబానికి రూ.5 లక్షల రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రజక విద్యార్థులకు విద్య కోసం నిధులు కేటాయించాలని, రజకుల రక్షణ చట్టం తేవాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. రజక సంఘం నాయకులు మురళి, రాజశేఖర్‌, వెంకటేష్‌, రాజు, నాగరాజు ,రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.