రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం

– తెలంగాణ బీసీ ఫెడరేషన్‌ కులాల సమితి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
బీసీ ఫెడరేషన్‌ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం హనుమాన్‌ టెక్నిక్‌లోని బీసీ సాధికారత భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రవేశపెట్టిన రూ.6,229 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో 2శాతం మాత్రమే బీసీలకు ఉండటం అందులోనూ ఫెడరేషన్ల ఊసేలేకపోవడం బాధాకరమ న్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారన్నారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపైన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. చర్చా గోష్టిలో తెలంగాణలోని వివిధ అనగారిన ఎంబీసీ కులాలు, బీసీ ఫెడరేషన్‌ కులాల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చిం చారు. అసెంబ్లీలో అనగారిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ఎన్నో పర్యాయాలు మంత్రులు, ఎమ్మెల్యేలకు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క అంశాల్లో కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా స్పందించకపోవడం చాలా బాధా కరం అన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులా లకు అన్యాయం జరుగుతుందని భావించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి బీసీ వర్గాలకు సీట్లు కేటా యించే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలను డిమాండ్‌ చేశారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనగారిన అన్ని సామాజిక వర్గాల తరపు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి అసెంబ్లీలో వాని వినిపించాలనీ, అందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళతామని చెప్పారు. ఈ నెల 25వ తేదీన ధర్నా చౌక్‌ (ఇందిరా పార్క్‌) వద్ద సామజిక వర్గాల జన చైతన్య దీక్ష చేపట్టి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి ఎం.భాస్కరుడు, రాష్ట్ర సలహాదారులు మంగిలిపెళ్ళి శంకర్‌ గంగపుత్ర, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ సంఘ వీరప్ప, రాష్ట్ర కార్యదర్శులు నర్సింగ్‌ గంగపుత్ర, రానా నగేష్‌ సింగ్‌, చేర్యాల రాకేష్‌, యశ్వంత్‌ నాయి, షేక్‌ ఇమామ్‌ పాషా, రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు కొత్తపల్లి బాయమ్మ, ఏపూరి శివరాం, కైరంకొండ రాజు, కుమ్మరి పి.కుమారస్వామి, వికాస్‌ నాయి, పరమేష్‌, నందు, ఎన్‌.రాజేష్‌, సురేష్‌ గంగపుత్ర, పాల్గొన్నారు.