7 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

– 14 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ
– నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 7 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు.
ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 7 గురిపై కేసు నమోదు చేసుకొని 14 మందికి గురువారం నగరంలోని జిల్లా టిటిఐ కౌన్సిలింగ్ సెంటర్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే పరిణామాల గురించి, ప్రమాదాల గురించి వీడియో ద్వారా ఫోన్లో క్షుణ్ణంగా చూపిస్తూ వివరించారు. వాహనదారులు ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని సూచించారు. వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని క్లుప్తంగా వివరించారు. కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారుల లో కోరారు. ఒకవేళ అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు మాస్క్ లను సైతం తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లేనియెడల ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని తెలియజేశారు.